ఢిల్లీ : ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన లబ్ధిదారులందరూ వార్షిక ప్రీమియం రూ.12 చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇది అతి త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల నుండి ఆటో డెబిట్ కాబోతుంది. సాధారణంగా ప్రతీ ఏడాది మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ మధ్య జరుగుతుంటుంది. ఈ పథకం కింద శాశ్వత వైకల్యం పొందినట్టయితే రూ.2 లక్షల బీమా అదే పాక్షికంగా వైకల్యం పొందితే రూ.1 లక్ష జీవిత బీమా నామినికి లభిస్తుంది.
ఇది కేవలం ప్రమాదాల్లో సంఘటనలకు మాత్రమే వర్తిస్తుంది. సహజ మరణాలకు వర్తించదు. బీమా క్లెయిమ్కు నామిని డెత్ సర్టిఫికెట్ లేదా అంగవైకల్య సర్టిఫికెట్ బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అనంతరం బీమా క్లెయిమ్ సబంధిత నామిని అకౌంట్లో జమ అవుతుంది.
18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల వారెవరైనా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరొచ్చు. అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి సంప్రదిస్తే ఈ పథకంలో చేరుస్తారు. లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. ఇలా ఒకసారి చేరితే ప్రతీయేటా ఆటోమెటిక్గా రెన్యువల్ అవుతూ పోతుంది.