నోముల భగత్ను గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇద్దాం. తండ్రిని కోల్పోయిన తనయుడికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జానా వృద్ధాప్యంలో పోరాడుతున్నాడు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ముఖ్యమంత్రికి భగత్ గెలుపును కానుకగా ఇద్దాం. రాష్ట్రంలోసాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలబెడుదాం.
మూడు నామినేషన్ల ఉప సంహరణ
నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు ఉపసంహరించుకున్నారు. మొత్తం 60మంది నామినేషన్లు ఆమోదం పొందగా స్వతంత్ర అభ్యర్థులు గొడవర్తి జానకీరామయ్య, రావులపాటి రవి శంకర్, ముదిగొండ వెంకటేశ్వర్లు నామినేషన్లను ఉప సంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.రోహిత్ సింగ్ తెలిపారు. చివరి రోజైన శనివారం మరికొందరు నామినేషన్లను ఉప సంహరించుకోనున్నట్లు సమాచారం.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి..
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే భగత్ విజయానికి బాటలు వేస్తాయి. 40సంవత్సరాల చరిత్ర కల్గిన జానారెడ్డిని ఓడించిన నోముల నర్సింహయ్య రెండేండ్లలోనే లక్షల రూపాయల పనులు చేయించారు. వస్రాంతండాలో రూ.2.70 కోట్లతో ఆనకట్టకు శంకుస్థాపన చేశారు. భగత్ గెలిచిన వెంటనే ఆ పని ప్రారంభిస్తారు. తానే ముఖ్యమంత్రినని చెప్పుకునే జానారెడ్డి రెండోసారి ఓటమికి సిద్ధంగా ఉండాలి.
సాగర్ అభివృద్ధికి రామ్మూర్తి యాదవ్ కృషి
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే, దివంగత గుండెబోయిన రామ్మూర్తియాదవ్ ఎంతో కృషి చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దదేవులపల్లిలో నిర్వహించిన యాదవ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు జరిపిన చరిత్ర దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యదని పేర్కొన్నారు. విద్యావంతుడైన నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో రామ్మూర్తి యాదవ్ కుమారుడు గుండెబోయిన కోటేశ్యాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకన్న యాదవ్, ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
వాతావరణ మార్పులపై శిఖరాగ్ర భేటీ.. మోదీకి బైడెన్ ఆహ్వానం
బంగ్లాలో మోదీ రెండో రోజు పర్యటన
మోదీ పర్యటనపై బంగ్లాదేశ్లో నిరసనలు.. కాల్పుల్లో నలుగురు మృతి
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. 32 మంది దుర్మరణం