బ్యూనస్ ఎయిర్స్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో విజయంతో సత్తాచాటింది. సోమవారం ఇక్కడ ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన రెండో మ్యాచ్లో టీమ్ఇండియా 3-0తో ఏకపక్ష విజయం సాధించింది. పెనాల్టీ కార్నర్ సాయంతో 11వ నిమిషంలోనే భారత ఆటగాడు హర్మన్ప్రీత్ సింగ్ గోల్ బాదాడు. ఆ తర్వాత లలిత్ ఉపాధ్యాయ్ (25వ ని.), మన్దీప్ సింగ్ (58వ.) గోల్స్ కొట్టడంతో భారత్కు తిరుగులేకుండా పోయింది. తొలి మ్యాచ్లో షూటౌట్ ద్వారా అర్జెంటీనాపై గెలిచిన భారత్ ఈ పోరులో పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి ఆతిథ్య జట్టును చిత్తుచేసింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో 8 మ్యాచ్ల్లో 15 పాయింట్లు సాధించిన భారత్ పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.