స్పిన్ మ్యాజిక్కు ఇంగ్లండ్ మరోసారి దాసోహమైంది. మూడో రోజు ముగియకుండానే రెండోసారి చేతులెత్తేసింది. స్పిన్ ట్విన్స్ ధాటికి తికమక పడిన ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ క్రీజులో నిలువలేకపోయారు. దీంతో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి.. లార్డ్స్లో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. మూడో రోజు సుందర్, అక్షర్ సూపర్ బ్యాటింగ్తో భారీ ఆధిక్యం రాగా.. అశ్విన్, అక్షర్ పదునైన బంతులతో రూట్సేనను బెంబేలెత్తించారు.
స్పిన్ పిచ్ అంటూ నానా రచ్చ చేసిన మైకేల్ వాన్ లాంటి మాజీ ఆటగాళ్లకు భారత్ చెంపపెట్టులాంటి సమాధానం చెప్పింది. తాము అలవోకగా 365 పరుగులు చేసిన పిచ్పై ఇంగ్లండ్ను రెండు ఇన్నింగ్స్ల్లో చిత్తుచిత్తుగా పడగొట్టి మేటి జట్టుగా నిరూపించుకుంది. స్పిన్తో ఇంగ్లండ్ కేవలం 2 వికెట్లు పడగొట్టిన చోట.. రెండో ఇన్నింగ్స్లో భారత స్పిన్నర్లు 10కి 10 వికెట్లు కూల్చారు. దీంతో ఇంగ్లిష్ జట్టు లోపాలు, కోహ్లీసేన నాణ్యత నిరూపితమవగా.. విమర్శకుల నోళ్లకు తాళాలు పడ్డాయి.
అహ్మదాబాద్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) తుదిపోరులో భారత్ ఘనంగా అడుగుపెట్టింది. సిరీస్లో చివరిదైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ను ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 365 పరుగులు చేస్తే.. రెండోసారి ఆడినా రూట్సేన ఆ స్కోరును కూడా అందుకోలేక మూడో రోజే కుప్పకూలిపోయింది. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ (5/47), అక్షర్ పటేల్ (5/48) మరోసారి విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 135 పరుగులకే చేతులెత్తేసింది. డాన్ లారెన్స్ (95 బంతుల్లో 50; 6ఫోర్లు), కెప్టెన్ జో రూట్ (72 బంతుల్లో 30) మినహా ఇంగ్లండ్ జట్టులో మరే బ్యాట్స్మెన్ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. అంతకు ముందు వాషింగ్టన్ సుందర్ (174 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు, ఓ సిక్స్), అక్షర్ పటేల్ (97 బంతుల్లో 43; 5ఫోర్లు ఓ సిక్స్) అద్భుత భాగస్వామ్యంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 365 పరుగులు చేసి, 160 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. సుందర్ అజేయంగా నిలిచినా చివర్లో వికెట్లు వెంటవెంటనే పడడంతో శతకం చేజారింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 4, అండర్సన్ 3, లీచ్ 2 వికెట్లు తీశారు. సిరీస్లో 30 వికెట్లతో పాటు ఓ శతకం బాదిన భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’, తొలి ఇన్నింగ్స్లో శతకంతో విజయంలో కీలకపాత్ర పోషించిన రిషబ్ పంత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు దక్కాయి. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ ఈనెల 12వ తేదీన అహ్మదాబాద్లోనే ప్రారంభం కానుంది. జూన్ చివర్లో లార్డ్స్ మైదానం వేదికగా జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టైటిల్ కోసం న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది.
ఇంగ్లండ్పై అద్భుత విజయంతో ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని అధిష్టించింది. న్యూజిలాండ్ (118)ను వెనక్కి నెట్టి భారత్ 122 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకుకు చేరింది. ఆస్ట్రేలియా (113), ఇంగ్లండ్ (105) ఆ తర్వాతి ర్యాంక్ల్లో ఉన్నాయి. అలాగే టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరిన కోహ్లీసేన.. పాయింట్ల పట్టికను అగ్రస్థానంతో ముగించింది.
విజయాల శాతం పాయింట్లు
భారత్ 72.2 520
న్యూజిలాండ్ 70.0 420
ఆస్ట్రేలియా 69.2 332
ఇంగ్లండ్ 61.4 442
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజయం తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్ను భారత్ చిత్తుచేయడం కచ్చితమనే అభిప్రాయాలు వెలువడ్డాయి. సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో సిరీస్ ఆడుతుండడంతో పాటు కోహ్లీ సహా సీనియర్లు జట్టులోకి రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చెన్నైలో తొలి టెస్టులో 227 పరుగుల తేడాతో పరాజయం టీమ్ఇండియాను షాక్కు గురి చేసింది. టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలపై సందేహాలు నెలకొల్పింది. అయితే రోహిత్ శర్మ శతకం సహా స్పిన్నర్లు అక్షర్, అశ్విన్ విజృంభించడంతో భారత్ 317 పరుగుల తేడాతో గెలిచి రెండో టెస్టులో పగ తీర్చుకుంది. ఆ తర్వాత అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో డే అండ్ నైట్గా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ను కోహ్లీసేన రెండు రోజుల్లోనే పడగొట్టేసింది. అశ్విన్, అక్షర్ ధాటికి రూట్సేనకు ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి. మరోవైపు ఇంగ్లిష్ జట్టు ఘోర ఓటమిని జీర్ణించుకోలేని మైకేల్ వాన్ లాంటి సీనియర్లు పిచ్పై అక్కసు వెళ్లగక్కారు. వాటిని మాటలతో దీటుగా తిప్పికొట్టిన టీమ్ఇండియా.. చివరి టెస్టులో మరోసారి ఆటతో సమాధానం చెప్పింది. మొత్తంగా తొలి టెస్టు ఆందోళన నుంచి కోలుకొని అద్భుత సిరీస్ విజయాన్ని కైవసం చేసుకోవడంతో పాటు.. తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అంతులేని ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టనుంది. మొత్తంగా ఈ సిరీస్లో అశ్విన్ 30 వికెట్లు తీసుకుంటే.. యువ స్పిన్నర్ అక్షర్ 27 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు.
వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ నిలకడగా ఆడడంతో 294/7 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు బరిలోకి దిగిన భారత్కు తొలి సెషన్లోనే మంచి ఆధిక్యం దక్కింది. సంయమనంతో పాటు వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇద్దరూ ముందుకు సాగారు. అయితే సెంచరీకి సుందర్ నాలుగు పరుగుల దూరం ఉన్న సమయంలో అక్షర్ లేని పరుగుకు వెళ్లి రనౌట్ కాగా.. 113 పరుగుల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన ఇషాంత్ (0), సిరాజ్ (0) డకౌట్గా వెనుదిరిగారు. 365 పరుగుల వద్దే భారత్ చివరి మూడు వికెట్లు కోల్పోగా.. సుందర్ శతకం మిస్సయింది. కాగా రెండో రోజు పంత్ అద్భుత సెంచరీతో అలరించిన విషయం తెలిసిందే.
160 పరుగుల వెనుకబాటుతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ను భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ ఆటాడేసుకున్నారు. ఐదో ఓవర్లోనే ఓపెనర్ క్రాలీ (5), ఆ తర్వాత జానీ బెయిర్స్టో (0)ను అశ్విన్ వరుస బంతుల్లో పెవిలియన్కు పంపితే.. పదో ఓవర్లో సిబ్లీ(3)ను అక్షర్ ఔట్ చేశాడు. ఓ ఎండ్లో కెప్టెన్ రూట్ క్రీజులో పాతుకుపోయేందుకు రంగం సిద్ధం చేసుకోగా.. స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ (2) ను ఊరించి అక్షర్ బుట్టులో వేసుకున్నాడు. దీంతో 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఓలీ పోప్ను పంత్ అద్భుతంగా స్టంపౌట్ చేశాడు. కాసేపటికే రూట్(30) కూడా అశ్విన్కు వికెట్ల ముందు దొరికి పోవడంతో టీ విరామానికి ఇంగ్లండ్ 91 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఇక చివరి వరకు పోరాడిన లారెన్స్ (50) అర్ధశతకంతో కాస్త ప్రతిఘటించగా.. మిగిలిన వారు అతడికి సహకరించకపోవడంతో ఇంగ్లండ్ కథ త్వరగానే ముగిసింది.
కెరీర్లో అశ్విన్ 30వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో అత్యధిక ఐదు వికెట్ల జాబితాలో 6వ స్థానంలో ఉన్న అండర్సన్ను సమం చేశాడు.
రెండు టెస్టు సిరీస్ల్లో 30 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు.
రవిచంద్రన్ అశ్విన్కు టెస్టుల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రావడం ఇది ఎనిమిదోసారి. భారత్ తరఫున ఇదే అత్యధికం కాగా.. అంతర్జాతీయంగా మురళీ ధరన్ (11), కలీస్ (9) మాత్రమే ముందున్నారు.
స్వదేశంలో టీమ్ఇండియాకు ఇది వరుసగా 13వ టెస్టు సిరీస్ విజయం. 2013లో ఆస్ట్రేలియా సిరీస్ నుంచి సొంతగడ్డపై భారత్ గెలుపు పరంపర కొనసాగుతున్నది. స్వదేశంలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగానూ మన జట్టు అగ్రస్థానంలో ఉంది. అలాగే భారత్లో విరాట్ కెప్టెన్సీలో వరుసగా 10వ సిరీస్ గెలుపు.
టెస్టు చాంపియన్షిప్లో 1000 పరుగులు చేసిన ఏకైక ఓపెనర్గా రోహిత్ శర్మ నిలిచాడు.
ఓ టెస్టులో సిరీస్లో 0-1తో వెనుకబడిన తర్వాత భారత్ వరుసగా మూడు మ్యాచ్లు గెలువడం ఇదే తొలిసారి.
కోహ్లీ సారథ్యంలో భారత్కు ఇది 36వ టెస్టు విజయం. ైక్లెవ్ లాయిడ్ రికార్డును విరాట్ సమం చేశాడు.
భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీసీసీఐ నుంచి ప్రత్యేక జ్ఞాపిక అందుకున్న క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్
అరంగేట్ర సిరీస్లోనే అత్యధిక వికెట్లు (27) తీసిన భారత బౌలర్గా దిలీప్ దోషి (6మ్యాచ్లు)ను అక్షర్ పటేల్ సమం చేశాడు.అక్షర్ (3) నాలుగు ఐదు వికెట్ల ప్రదర్శన సహా మొత్తం ఈ సిరీస్లో 27 వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్: 205 ఆలౌట్.
భారత్ తొలి ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీడబ్ల్యూ) అండర్సన్ 0, రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) స్టోక్స్ 49, పుజార (ఎల్బీడబ్ల్యూ) లీచ్ 17, కోహ్లీ (సి) ఫోక్స్ (బి) స్టోక్స్ 0, రహానే (సి) స్టోక్స్ (బి) అండర్సన్ 27, పంత్ (సి) రూట్ (బి) అండర్సన్ 101, అశ్విన్ (సి) పోప్, (బి) లీచ్ 13, సుందర్ (నాటౌట్) 96, అక్షర్ రనౌట్ (బెయిర్స్టో/ రూట్) 43, ఇషాంత్ (ఎల్బీడబ్ల్యూ) స్టోక్స్ 0, సిరాజ్ (బౌల్డ్) స్టోక్స్ 0; ఎక్స్ట్రాలు 19, మొత్తం: 114.4 ఓవర్లలో 365 ఆలౌట్. వికెట్ల పతనం: 1-0, 2-40, 3-41, 4-80, 5-121, 6-146, 7-259, 8-365, 9-365,
10-365; బౌలింగ్: అండర్సన్ 25-14-44-3, స్టోక్స్ 27.4-6-89-4, లీచ్ 27-5-89-2, బెస్ 17-1-71-0, రూట్ 18-1-56-0
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రహానే (బి) అశ్విన్ 5,
సిబ్లీ (సి) పంత్ (బి) అక్షర్ 3, బెయిర్స్టో (సి) రోహిత్ (బి) అశ్విన్ 0, రూట్ (ఎల్బీడబ్ల్యూ) అశ్విన్ 30, స్టోక్స్ (సి) కోహ్లీ (బి) అక్షర్ 2, పోప్ (స్టంప్) పంత్ (బి) అక్షర్ 15, లారెన్స్ (బౌల్డ్) అశ్విన్ 50, ఫోక్స్ (సి) రహానే (బి) అక్షర్ 13, బెస్ (సి) పంత్(బి) అక్షర్ 2, లీచ్ (సి) రహానే (బి) అశ్విన్ 2, అండర్సన్
(నాటౌట్) 1; ఎక్స్ట్రాలు: 12, మొత్తం: 54.5 ఓవర్లలో 135 ఆలౌట్. వికెట్ల పతనం: 1-10, 2-10, 3-20, 4-30, 5-65, 6-65, 7-109, 8-111,
9-134, 10-135;
బౌలింగ్: సిరాజ్ 4-0-12-0, అక్షర్ 24-6-48-5,
అశ్విన్ 22.5-4-47-5,
సుందర్ 4-0-16-0.