ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపిన టీమ్ఇండియాను కరోనా వైరస్ దెబ్బకొట్టింది. సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న సమయంలో.. ప్లేయర్లతో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్న జూనియర్ ఫిజియోకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో భారత ఆటగాళ్లు బరిలో దిగేందుకు నిరాక రించారు. ఫలితంగా భారత్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టు రద్దు కాగా.. ఈ మ్యాచ్ను తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కసరత్తులు ప్రారంభించాడు!
మాంచెస్టర్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టు అర్ధాంతరంగా రైద్దెంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్ల్లో టీమ్ఇండియా రెండింట నెగ్గి సిరీస్లో 2-1తో ముందంజలో నిలిచిన సమయంలో భారత సహాయ బృందంలో కరోనా కేసులు వెలుగు చూడటంతో మ్యాచ్ను నిలిపివేశారు. దీంతో సిరీస్ ఫలితం తేలకపోగా.. రైద్దెన ఆఖరి టెస్టును తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతుండగా.. గురువారం జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్కు కూడా కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆటగాళ్లకు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఆందోళనల మధ్య బరిలోకి దిగడం ఇష్టం లేని కోహ్లీసేన మ్యాచ్ను వాయిదా వేయాల్సిందిగా బీసీసీఐకి తెలిపింది. తొలుత ఈ విషయంలో కాస్త గందరగోళం నెలకొని ‘టీమ్ఇండియా ఫీల్డ్లోకి దిగేందుకు సిద్ధంగా లేదు’ అందుకే మ్యాచ్ను రద్దు చేస్తున్నామని ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. బీసీసీఐతో చర్చల అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
మళ్లీ ఎప్పుడో..!
ఇంగ్లిష్ గడ్డపై కోహ్లీసేన సిరీస్ నెగ్గడం ఖాయం అనుకుంటున్న సమయంలో మహమ్మారి పంజా విసరడం టీమ్ఇండియాను దెబ్బకొట్టింది. రైద్దెన చివరి టెస్టును ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేకున్నా.. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. ‘ఈసీబీ, బీసీసీఐ మధ్య సత్సంబంధాలున్నాయి. రైద్దెన మ్యాచ్ను తిరిగి జరిపే దిశగా రెండు దేశాల బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నాయి’ అని జై షా అన్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు టెస్టులే ఆడిన టీమ్ఇండియా.. పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వచ్చే ఏడాది జూలైలో మరోసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.. అప్పుడే ఈ టెస్టును నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 22న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంగ్లండ్ వెళ్లనున్నాడు.