జగదేవ్పూర్, ఏప్రిల్ 27 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని కొండపోచమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ప్రసిద్ధ తీగుల్నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయాన్ని మండల నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదేవ్పూర్ గ్రామానికి చెందిన సాగర్గౌడ్ బహూకరించిన వెండి కిరీటాలను అర్చకులు కొండపోచమ్మ, జగదేవ్పూర్ ఎల్లమ్మ అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి మాట్లాడారు. కరోనా తీవ్రరూపం విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్, భౌతిక దూరం పాటించాలన్నారు. అంతకు ముందు వారిని ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ రంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, రైతుబంధు కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్గౌడ్, టీఆర్ఎస్ యువజన నాయకులు కరుణాకర్, సర్పంచ్లు యాదవరెడ్డి, రజితారమేశ్, నరేశ్, నాయకులు లక్ష్మణ్ ఉన్నారు.