సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): నిబంధనలను అతిక్రమిస్తున్న వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం కొరడా ఝళిపిస్తున్నది. అనుమతి లేకుండా నేమ్ బోర్డుపై ఫ్లాష్ లైటింగ్ ఏర్పాటు చేసిన పలు వ్యాపార సంస్థలకు బుధవారం అధికారులు భారీ జరిమానా విధించారు. కూకట్పల్లిలో నిబంధనలకు విరుద్ధ్దంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్కు రూ. 2లక్షలు, ఏఎస్రావునగర్లో లైటింగ్ నియమనిబంధనలు పాటించని షాపింగ్ మాల్కు రూ. 5వేలు, మరో షాపింగ్మాల్కు రూ.5వేలు, నాగోల్ ఓ ఫర్నీచర్ మాల్కు రూ. 10వేలు , కూకట్పల్లిలో ఓ రెస్టారెంట్కు రూ.10వేలు జరిమానా విధించారు. ఇందులో భాగంగానే 2,09,139 మందికి నోటీసులు జారీ చేయగా, 1, 21, 848 మంది ఉల్లంఘనులకు చలాన్లు విధించారు. జరిమానా రూపంలో రూ. 5కోట్ల మేర వసూళ్లను రాబట్టారు. వీటితో పాటు ఉచిత పార్కింగ్ పాలసీని పక్కాగా అమలు చేస్తున్నారు.