ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)లో న్యూజిలాండ్తో తలపడేందుకు టీమ్ఇండియా సన్నద్ధమైంది. సౌతాంప్టన్లోని ఏజీస్ బౌల్ మైదానంలో శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఫైనల్ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ, గిల్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నారు.
తుదిపోరుకు అర్హత సాధించే క్రమంలో న్యూజిలాండ్ చేతిలో మాత్రమే ఓడిన కోహ్లీసేన.. ఇప్పుడదే కివీస్తో ఫైనల్ ఫైట్లో తలపడనుంది. మరోవైపు ఆసీస్ చేతిలో పరాజయం తర్వాత వరుసగా భారత్, వెస్టిండీస్, పాకిస్థాన్పై విజయాలతో న్యూజిలాండ్ ఫైనల్కు చేరింది.
భారత జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, పుజారా, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ