మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగనున్న చివరి టెస్ట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు రద్దయిన సంగతి తెలుసు కదా. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ మ్యాచ్ను రీషెడ్యూల్ చేయడానికి ఈసీబీతో చర్చిస్తోంది బీసీసీఐ. అదే జరిగితే ఈ సిరీస్ ఇంకా ముగియనట్లే. ఈసీబీతో బీసీసీఐకి మంచి సంబంధాలు ఉండటంతో.. ఈ రద్దయిన మ్యాచ్ను మళ్లీ నిర్వహించే అంశంపై రెండు బోర్డులు చర్చిస్తున్నాయి అని బోర్డు వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది టీ20, వన్డే సిరీస్ కోసం టీమిండియా మళ్లీ ఇంగ్లండ్ వస్తోంది. మరి అప్పుడు ఈ టెస్ట్ ఏమైనా ఆడతారా అన్నది చూడాలి.