IND vs Srilanka : శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో శ్రీలంక ముందు టీమిండియా ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఆతిథ్య లంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి బంతికే పృథ్వీషా డకౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ ( 34 బంతుల్లో 50 పరుగులు ), కెప్టెన్ శిఖర్ ధావన్ ( 36 బంతుల్లో 46 పరుగులు) రాణించారు. చివరలో ఇషాన్ కిషన్ (20 నాటౌట్ ) కాస్త వేగంగా పరుగులు చేయడంతో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది.