ములుగు : నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా రాష్ట్ర ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి జిల్లాలోని జంగాలపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనం పెంపకం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంపై పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, సర్పంచ్ అనితా రాణి , ప్రత్యేక అధికారి డా. నవత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తహసీల్దార్ ఆఫీస్కు తాళి కట్టిన ఘటనపై విచారణ
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి