దుబాయ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో టీమిండియా ధాటిగా ఆడుతోంది. 153 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (39), రోహిత్ శర్మ (53 నాటౌట్) అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఆసీస్ బౌలర్ ఆష్టన్ అగర్ విడదీశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (20 నాటౌట్) కూడా రాణించడంతో ఇన్నింగ్స్ 13వ ఓవర్లో భారత్ 100 పరుగులు దాటింది. ఆ వెంటనే స్టొయినిస్ బౌలింగ్లో ఫోర్ బాదిన రోహిత్ అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.