బచ్చన్నపేట, మార్చి 30 : మండలంలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలని ఎంపీడీవో రఘురామకృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రజలకు పారదర్శక పాలన అందించడంతోపాటు మౌలిక వసతు లు కల్పించాలనే లక్ష్యంతో పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే ఊరికో నర్సరీ, పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డు, శ్మశానవాటిక నిర్మిస్తున్నదని వివరించారు. అన్ని గ్రామాల్లో వందశాతం ఇంటి, నల్లా పన్నులు వసూలు చేయాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పనులకు రోజుకు వంద మందికి పైగా కూలీ లు వచ్చేలా చూడాలని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో ఈసీ మోహన్, టీఏ సత్యనారాయణ, స్వామి, కరుణాకర్, భాను, పంచాయతీ కార్యదర్శులు భీమ్రాజ్, రేవతి, కవిత, కల్యాణి, రుబీనా, రూపాచైతన్య, భాను, రాజశేఖర్, సతీశ్రెడ్డి, సురేశ్, సంతోష్, కిరణ్కుమార్, రాధాకృష్ణ, రాజన్బాబు, ప్రశాంత్ ఆచార్య, శ్రీనివాసాచారి, దేవిప్రసాద్, భరత్, నరేశ్, పరశురాములు, ఉపేందర్, శ్రీనివాస్, ప్రశాంత్ పాల్గొన్నారు.