హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత రైల్వేస్కు చెందిన వీఏవీ రాజేశ్ విజేతగా నిలిచాడు. తెలంగాణ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన టోర్నీ ఫైనల్ రౌండ్లో అంతర్జాతీయ మాస్టర్ రాజేశ్(8.5 పాయింట్లు).. తెలంగాణకు చెందిన ఆదిరెడ్డి అర్జున్పై విజయం సాధించి టైటిల్ను ఒడిసిపట్టుకున్నాడు. తమిళనాడుకు చెందిన ఎల్ ముత్తయ్య(8 పాయింట్లు).. శ్రీరామ్ ఆదర్శపై విజయంతో రెండో స్థానంలో నిలిచాడు. నరేంద్ర పల్లవాన్(8) మూడో స్థానంతో టోర్నీని ముగించాడు. కరోనా వైరస్ విజృంభణ తర్వాత ముఖాముఖి జరిగిన ఈ తొలి టోర్నీలో 410 మంది ప్లేయర్లు పోటీపడ్డారు.