కొత్తగూడెం క్రైం, మార్చ్ 29: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. జిల్లాలోని కోబ్రామెందా అటవీ ప్రాంతంలో భారీగా నక్సలైట్లు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసు విభాగానికి చెందిన సీ-60 కమాండోలు శనివారం గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం వీరి రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో కమాండోలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు. ఘటనాస్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, పారిపోయిన నక్సల్స్ కోసం గాలింపు కొనసాగుతున్నదని పోలీసులు చెప్పారు.
ఇవీ కూడా చదవండి..
కమల్ జీ..బీజేపీ అభ్యర్ధితో చర్చకు రండి : స్మృతి ఇరానీ
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్