న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరుతో ఒక నకిలీ ట్విట్టర్ ఖాతా ఉన్నది. దీని నుంచి తప్పుడు సందేశాలు పోస్ట్ చేయడాన్ని గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన ఎన్వీ రమణకు ట్విట్టర్ లేదా సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి ఖాతాలు లేవు. అయితే @NVRamana పేరుతో ట్విట్టర్లో ఒక నకిలీ ఖాతా ఉన్నది. దీనిలో ఇప్పటి వరకు 98 ఫేక్ పోస్టులు పెట్టారు. దీనిని 5,859 మంది అనుసరిస్తున్నారు.
మరోవైపు “అజిత్ డోవల్ దౌత్యం కారణంగా, భారతదేశానికి ముడి పదార్థాలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది #vaccination @PMOIndia.. అని తాజాగా ఫేక్ ట్వీట్ చేసి అనంతరం డిలీట్ చేశారు. ఇది జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.