తెలుగు ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా విడుదలైన నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలు సంచలన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే తన లక్ష్యం చేధించింది. నాలుగో రోజు నుంచి లాభాల బాట పట్టించింది. లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా అద్భుతంగా యూజ్ చేసుకుంది. వీకెండ్ లోనే 20 కోట్ల షేర్ వసూలు చేసింది. 12 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన జాతి రత్నాలు బయ్యర్లకు లాభాల పంట పండిస్తుందిప్పుడు. సోమవారం కూడా చాలా చోట్ల ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. లాజిక్ లేని మ్యాజిక్ అంటూ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అనుదీప్ కేవీ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు.
నైజాం – 7.07 కోట్లు
సీడెడ్ – 2.8 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.31 కోట్లు
నెల్లూరు – 59 లక్షలు
కృష్ణ – 1.07 కోట్లు
గుంటూరు – 1.31 కోట్లు
వైజాగ్ – 96 లక్షలు
ఈస్ట్ – 97 లక్షలు
వెస్ట్ – 97 లక్షలు
రెస్టాఫ్ ఇండియా – 61 లక్షలు
ఓవర్సీస్ – 3.31 కోట్లు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.