దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్(ICC ODI Rankings)లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుసగా రెండు, మూడు ర్యాంకులను నిలబెట్టుకున్నారు. కోహ్లీ ఖాతాలో 857 రేటింగ్ పాయింట్లు ఉండగా, రోహిత్ ఖాతాలో 825 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్(865 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 690 రేటింగ్స్తో జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్నాడు. వన్డే ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే తొమ్మిదో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ 387 పాయింట్లతో టాప్లో ఉన్నాడు.