హైదరాబాద్ : సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మఫ్టీలోని షీ టీమ్స్ పోలీసుల కోసం ప్రభుత్వం స్కూటీలను పంపిణీ చేసింది.
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సిబ్బందికి 33 స్కూటీలను కేటాయించింది. గోషామహల్ స్టేడియంలో హోంమంత్రి మహమూద్ అలీ ఇవాళ ఈ స్కూటీలను ప్రారంభించారు.
మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం పోలీసు శాఖ షీటీమ్స్ను ఏర్పాటు చేసింది. షీటీమ్స్ ఏర్పాటు తరువాత మహిళలపై ఆకతాయిల వేధింపులు తగ్గాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి