టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మార్గదర్శకాలు జారీచేసింది. ఈ టోర్నమెంట్ కోసం 15 మంది ఆటగాళ్లు, 8 మంది అధికారులను తీసుకురావడానికి రాబోయే టీ20 ప్రపంచ కప్లో పాల్గొనే దేశాలకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. 15 మంది ఆటగాళ్ల జాబితాతోపాటు కోచ్, సహాయక సిబ్బంది జాబితాను సెప్టెంబర్ 10 లోపు పంపాలని ఐసీసీ గడువు విధించినట్లు పీసీబీ అధికారి ఒకరు శుక్రవారం ధ్రువీకరించారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఎంత మంది అదనపు ఆటగాళ్లను జట్టుతో ఉంచాలనుకుంటున్నారో కూడా నిర్ణయించుకోవాలని తెలిపినట్లు ఆయన చెప్పారు. ఈ అదనపు ఖర్చును ఆయా దేశాల బోర్డులే భరించాల్సి ఉంటుంది. ముందుగా పేర్కొన్న 15 మంది ఆటగాళ్లు, 8 మంది అధికారుల ఖర్చులను మాత్రమే ఐసీసీసీ భరించనున్నది. కాగా, ఆటగాళ్లు అక్కడికి బయల్దేరే ఐదు రోజుల ముందు వరకు జాబితాలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది.
టీ20 వరల్డ్కప్ ఈ ఏడాది భారతదేశంలో జరగాల్సి ఉన్నది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా టోర్నమెంట్ను యూఏఈకి మార్చారు. టీ20 ప్రపంచకప్ 2016 తర్వాత తొలిసారి నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ను అక్టోబర్ 17-నవంబర్ 14 మధ్య ఒమన్, యూఏఈలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, అతిథిగా భారతదేశం మాత్రమే వ్యవహరిస్తున్నది. టీ20 వరల్డ్ కప్ కోసం క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ 23 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నది. 2014 టీ20 ఛాంపియన్ శ్రీలంక, ఐర్లాండ్, బంగ్లాదేశ్ జట్లు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. నాలుగు జట్లు సూపర్-12 కి అర్హత సాధిస్తాయి. ప్రధాన జట్టులోని ఆటగాడు కొవిడ్-19 పరీక్షలో పాజిటివ్గా వచ్చినా లేదా గాయపడినా.. అదనపు ఆటగాళ్లతో భర్తీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి.
తాలిబాన్లకు పాక్ జనరల్స్ మద్దతు : మాజీ ఎంపీ ఆరోపణ
ఆఫ్ఘాన్ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా
ఇంగ్లండ్లో తుపాకీ కాల్పులు.. ఆరుగురు మృతి
నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు మోదీ తాతా..?!
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..