కొనసాగుతున్న కూంబింగ్
200మంది పోలీసులతో ఏటూరునాగారంలో కార్డన్ సెర్చ్
ఇంటింటా తనిఖీలు, 115 వాహనాలు స్వాధీనం
వెల్లడించిన ఏఎస్పీ గౌస్ ఆలం
ఏటూరునాగారం, ఏప్రిల్ 6 : సరిహద్దు ల్లో హై అలర్ట్ కొనసాగుతున్నదని, అపరిచిత వ్యక్తులకు ఆశ్రయమివ్వొద్దని ఏఎస్పీ గౌస్ ఆలం స్థానికులను కోరారు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలో సుమారు 200 మం ది సీఆర్పీఎఫ్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటా తనిఖీలు చేపట్టి ఎలాంటి డాక్యుమెంట్లు లేని 111 బైక్లు, మూడు ఆటోలు, ఒక తవేరా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ మాట్లాడు తూ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందారని, సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతున్నదన్నా రు. ఈ నేపథ్యంలో ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశామని, సరిహద్దుల్లో కూం బింగ్ కూడా కొనసాగుతున్నదని తెలిపారు. ఎలాం టి గుర్తింపు కార్డులు లేని వారికి ఇండ్లు అద్దెకు ఇవ్వొద్దని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సబ్ డివిజన్లో షీ టీం ఏర్పాటు
ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలో షీ టీం ఏర్పాటు చేసినట్లు సీఐ కిరణ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా ఈవ్టీజింగ్కు పాల్పడితే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి కాగితాలు ఉంటే అందజేసి వాహనాలు తీసుకెళ్లవచ్చని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం, వెంకటాపురం సీఐలు కిరణ్కుమార్, శివప్రసాద్, ఎస్సైలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనువాస్, వెంకటేశ్వర్రావు, శ్యాం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దీదీ.. మీరు ఆటాడిన రోజే మీ ఓటమి గురించి దేశానికి తెలిసిపోయింది: ప్రధాని మోదీ
కరోనా కట్టడిలో భారీ ముందడుగు : 24 గంటల్లో 43 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు