దుబాయ్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ జో రూట్, ఐర్లాండ్ మహిళల ఆల్రౌండర్ రిచర్డ్సన్ ఆగస్టు నెలకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఐసీసీ తాజాగా వివరాలను ప్రకటించింది. పురుషుల విభాగంలో రూట్.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని వెనక్కినెట్టి ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. భారత్తో జరిగిన సుదీర్ఘ టెస్టు సిరీస్లో నాలుగు టెస్టులాడిన రూట్ 507 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రిచర్డ్సన్.. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీలో ఏడు వికెట్లు తీసిన ఆమె.. బ్యాటింగ్లోనూ విలువైన పరుగులు చేసింది.