వ్యవసాయ యూనివర్సిటీ : మార్చి 29 : వేసవిలో సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు, సేంద్రియ ఎరువులతో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనల మేరకు పండించిన పంటలను వాడటంవల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని విశ్వవిద్యాలయం విద్యార్థులు సూచించారు. ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆహార పోషణ విభాగం శాస్త్రవేత్తల సూచనలు, విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణలోనే స్టాల్స్ ఏర్పాటు చేసి రాగులు, జొన్న, సజ్జ, తదితర వాటితో తయారు చేసిన బిస్కెట్స్, బ్రెడ్స్, ఉండలి, జావా తదితర ప్యాకెట్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. రూ.12 నుంచి 110 వరకు ధరలు ఉన్నాయి. ప్రయాణికులే కాకుండా సమీప ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.
వేసవి తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, వడదెబ్బ తగలడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి అనారోగ్యాలు ధరిచేరకుండా రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, భోజనంలో సాంబారు, రసం, సూప్స్ తీసుకోవాలన్నారు. ఈ సీజన్లో అందుబాటులో ఉన్న పుచ్చ, కర్బూజ, ద్రాక్ష, తీసుకోవాలి. కారం, మసాల నూనెలు ఎక్కువగా ఉండే వేపుళ్లు, బేకరీ ఫుడ్ వంటివి వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. ఉదయం పరిగడపున నీరుతాగడం చాలా మంచిదన్నారు. నాటి నుంచి వినియోగంలో ఉన్న చిరుధాన్యాలు రాగులు, వీటిలో కాల్షియం, పొటాషియం అధికంగా లభిస్తాయి.
వీటిల్లో పిండి పదార్థం, ఖనిజాలవణాలు, ఫ్రోటీన్లు అధికంగా ఉంటాయి. మనకు శక్తినిచ్చే చాలా రకాల ‘బి’ విటమిన్లు ైగ్లెసిమిక్ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రాగులు మధుమేహం రోగులకు మంచి ఆహారం, రాగుల్లో రక్తంలోని కొలెస్ట్రాల్ను నియంత్రించి గుండెను రక్షించే లక్షణాలు ఉన్నాయని, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని ఆహార పోషణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త కమలాజా తెలిపారు. సీనియర్ విద్యార్థులు వాటిని తయారు చేసి విక్రయించడం చేస్తున్నారన్నారు.