హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు రాష్ర్ట ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. గ్రామాలు, పట్టణాల్లో పెట్రోల్ బంకులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ధాన్యం సేకరణ, అవసరాల కోసం వినియోగించే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. హైవేలపై పెట్రోల్ బంకులకు ఇప్పటికే మినహాయింపు ఉండగా, తాజాగా గ్రామాలు, పట్టణాల్లో ఉండే బంకులను కూడా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.