వైద్యానికి సంబంధించి అత్యవసర సేవలు అవసరం ఉన్నవారు శ్రీనివాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సౌజన్యంతో అందుబాటులోకి తెచ్చిన నాలుగు క్యాబ్లను వృద్ధులు, గర్భిణులు, డయాలిసిస్ పేషెంట్లు, ఇతర రోగులు ఉచితంగా ఉపయోగించుకోవాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు. సోమవారం ఎల్బీనగర్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు శ్రీనివాస్తో కలిసి క్యాబ్ సేవలను ప్రారంభించారు. ఈ సేవలను పొందాలనుకున్నవారు రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూం 9490617234కు ఫోన్ చేయాలని సీపీ తెలిపారు. ఈ క్యాబ్లను ఎల్బీనగర్ జోన్, చౌటుప్పల్ డివిజన్వారు ఉపయోగించుకోవచ్చన్నారు.