హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ టోర్నీలో స్థానిక సెయిలర్ సంజయ్రెడ్డి సత్తాచాటుతున్నాడు. మంగళవారం జరిగిన బాలుర ఐఎల్సీఏ ఈవెంట్లో సంజయ్ ఆధిక్యం కనబరిచాడు. హుస్సేన్సాగర్లో మూడు రేస్లు జరిగే సరికి అగ్రస్థానం దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్కు చెందిన అలేఖ్య కుందు టాప్-3లో నిలువగా, నేహా ఠాకూర్(ఎన్ఎస్ఎస్) ఓవరాల్ ఆధిక్యం కనబరిచింది. బాలుర ఐఎల్సీఏ-7 కేటగిరీలో గితేశ్ మొదటి మూడు రేసుల్లో టాప్ కైవసం చేసుకున్నాడు.