చాదర్ఘాట్, సెప్టెంబర్ 14: జాతీయ కరాటే చాంపియన్షిప్ పోటీలకు హైదరాబాద్కు చెందిన సయ్యద్ తాలిబ్ హుస్సేన్(84కి), సయ్యద్ మహమ్మద్ హుస్సేన్(60కి), ఫసహత్ అహ్మద్ఖాన్(55కి) ఎంపికయ్యారు. మలక్పేటలోని పాకో మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీకి చెందిన ఈ ముగ్గురు డెహ్రాడూన్లో జరిగే జాతీయ కరాటే టోర్నీలో తెలంగాణ తరఫున బరిలోకి దిగుతారని అకాడమీ ఫౌండర్ ఇఫ్తికార్ హుస్సేన్ పేర్కొన్నారు.