చెన్నై: చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లాడు. కొవిడ్-19 నెగెటివ్గా నిర్ధారణ కావడంతో ఆదివారం దోహా నుంచి స్వదేశానికి పయనమైనట్లు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నాడు. నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్లో చెన్నై జట్టులో తొలుత హస్సీ కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కూడా పాజిటివ్ రావడంతో జట్టులో ఒకింత ఆందోళన నెలకొన్నది. ఈ ఇద్దరిని ప్రత్యేకమైన ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీ నుంచి చెన్నైకి తరలించి ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించారు. ఇటీవల జరిపిన పరీక్షల్లో హస్సీకి నెగెటివ్ రావడంతో జట్టు వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.