హాకీలో అదరగొట్టిన తమ రాష్ట్ర ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని ఆటగాళ్లకు ఒక్కోక్కరికి కోటి రూపాయల నగదు బహుమానం ఇవ్వనుంది. భారత హాకీ జట్టులో కెప్టెన్ మన్ప్రీత్ సింగ్తో పాటు 8 మంది ఆటగాళ్లు పంజాబ్ నుంచే ఉండటం విశేషం. ఇక జట్టులోని హర్యానాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు ఆ రాష్ట్రం రూ.2 కోట్ల నగదు బహుమతి అందించనుంది. దాంతోపాటు క్రీడాశాఖలో ఉద్యోగం కూడా ఇవ్వనుంది. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు ప్లేయర్లకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ఇస్తున్నట్లు పేర్కొంది.
రవికి 4 కోట్లు
టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన రవి కుమార్ దహియాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.4 కోట్లతో పాటు క్లాస్-1 ఉద్యోగం అందించనున్నట్టు ప్రకటించింది.