ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ బోణీ చేసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ధోనీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై టీమ్ తరఫున 200 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్లో ఒక ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్ కెప్టెన్ కూల్ మహీనే కావడం విశేషం. ఐపీఎల్లో ధోనీ ఇప్పటి వరకు 206 మ్యాచ్లు ఆడాడు. ధోనీ సారథ్యంలో చెన్నై 2010, 2011, 2018 టైటిల్ విజేతగా నిలిచింది. ధోనీ 200 మార్క్ చేరుకోవడంపై మ్యాచ్ అనంతరం సహచర ఆటగాళ్లతో సెలబ్రేషన్స్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ధోనీ కేక్ కట్ చేశాడు. కేక్ను హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్తో పాటు సురేశ్రైనా తదితరులుకు తినిపించాడు. అరుదైన ఘనత సాధించిన ధోనీని ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సోషల్మీడియాలో షేర్ చేసింది.