హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని హాకీ రంగారెడ్డి నిర్వహించిన ముకేశ్ కుమార్ గోల్డెన్ కప్లో నిజామాబాద్ జట్టు విజేతగా నిలిచింది. సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం జరిగిన ఫైనల్లో నిజామాబాద్ 4-1 తేడాతో మహబూబ్నగర్పై విజయం సాధించింది. ఈ టోర్నీని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించగా.. పోటీల అనంతరం విజేతలకు ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ, చాముండేశ్వరీనాథ్ బహమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పారిజాత హోమ్స్ చైర్మన్ అంజయ్య యాదవ్, శ్రీధర్, ముకేశ్ కుమార్, సరల్ తల్వర్ తదితరులు పాల్గొన్నారు.