చండీగఢ్: నాలుగు దశాబ్దాల తర్వాత భారత్కు హాకీలో ఒలింపిక్ పతకాన్ని సాధించిన జట్టులో సభ్యులుగా ఉన్న పంజాబ్, హర్యానా ఆటగాళ్లకు వారి స్వరాష్ట్రంలో ఘనస్వాగతం లభించింది. బుధవారం అమృత్సర్ చేరుకున్న ఆటగాళ్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లో పంజాబ్ ఆటగాళ్లకు స్థానిక అధికార యంత్రాంగం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరో వైపు హాకీ జట్టు గోల్ కీపర్ శ్రీజేశ్కు కేరళ ప్రభుత్వం రెండుకోట్ల నజరానా ప్రకటించింది.
ఒడిషా హాకీ ఆటగాళ్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భారీ నజరానా ప్రకటించారు. బీరేంద్ర లక్రా, రోహిదాస్లకు రూ. 2.5 కోట్ల నగదుతో పాటు వారికి డీఎస్పీ నియామక పత్రాలను అందజేశారు.