హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలో క్షేత్రస్థాయిలో ఫుట్బాల్ను మరింత అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) సిద్ధమైంది. భారత ఫుట్బాల్ దిగ్గజం, హైదరాబాదీ సయ్యద్అబ్దుల్ రహీమ్ నేపథ్యం ఆధారంగా రూపుదిద్దుకున్న ‘మైదాన్’ సినిమాతో హెచ్ఎఫ్సీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సహా దేశంలో ఫుట్బాల్ క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు ఇది దోహదపడుతుందని ఈ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని వరుణ్ త్రిపురనేని అన్నారు. గురువారం వర్చువల్ విధానంలో జరిగిన మీడియా సమావేశంలో వరుణ్తో పాటు ‘మైదాన్ సినిమా నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు అమిత్శర్మ, అకాశ్ చావ్లా, అరుణవ జాయ్ సేన్గుప్తా తదితరులు పాల్గొన్నారు. రహీమ్ సాబ్..హైదరాబాద్కే కాదు దేశ ఫుట్బాల్కు ఎనలేని సేవలు అందించారని వరుణ్ అభిప్రాయపడ్డారు.