లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమాముల్ హక్ గుండెపోటుకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో సోమవారం దవాఖానలో చేరాడు. పలు పరీక్షల అనంతరం సీనియర్ సర్జన్ అబ్బాస్ ఖాజీమ్ నేతృత్వంలోని వైద్యుల బృందం అంజియోప్లాస్టి నిర్వహించింది. శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న దవాఖాన వర్గాలు మంగళవారం డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నాయి. 51 ఏండ్ల ఇంజమామ్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు పలువురు ప్లేయర్లు ట్విట్టర్లో అభిలషించారు. పాకిస్థాన్ తరఫున 120 టెస్టులు, 378 వన్డేలాడిన ఇంజమామ్..2016-19 మధ్యకాలంలో పీసీబీ చీఫ్ సెలెక్టర్గా పనిచేశాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్పై గెలిచిన పాక్ టైటిల్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.