బొంరాస్పేట, ఏప్రిల్ 19 : టీఆర్ఎస్తోనే గ్రామాలు, తండాల అభివృద్ధి సాధ్యమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తుంకిమెట్ల, బుర్రితండా, మెట్లకుంట గ్రామాల్లో వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లను, బుర్రితండాలో ఎస్టీ కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. మెట్లకుంటలో మహిళలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు, గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వైకుంఠధామాల ఆవరణల్లో బోరు వేసి మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అధికారులు, సర్పంచ్లను ఎమ్మెల్యే ఆదేశించారు. కంపోస్టు షెడ్లలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఎలా వేయాలో శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు.
సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది.. అప్రమత్తంగా ఉండాలి
కరోనా రెండో దశ తీవ్రంగా ఉందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. తుంకిమెట్లలో టీఆర్ఎస్ నాయకుడు తోలు వెంకటయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాస్కులు పంపిణీ చేశారు.
వైభవంగా మారెమ్మ సేవాలాల్ విగ్రహాల ప్రతిష్ఠాపన
మండలంలోని గట్టెనాయక్తండాలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో మారెమ్మ, సంత్ సేవాలాల్ విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే నరేందర్రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎమ్మెల్యేను సంప్రదాయ తలపాగాతో సన్మానించారు. సంప్రదాయ వస్ర్తాలు ధరించిన గిరిజన మహిళలు, యువకులు ఎమ్మెల్యేతో కలిసి ఫొటోలు దిగారు. గిరిజన మహిళలు నృత్యాలు చేస్తూ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మారెమ్మ, సేవాలాల్ అనుగ్రహంతో కరోనా అంతమై ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అహ్మద్పాషా, ఎంపీటీసీలు తిరుపతయ్య, శ్రవణ్గౌడ్, సుదర్శన్రెడ్డి, తాలుకా, మండల యూత్ అధ్యక్షులు నరేశ్గౌడ్, మహేందర్, టీఆర్ఎస్ నాయకులు దేశ్యానాయక్, నర్సింహానాయక్, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్లు స్వరూప, నారాయణ, లక్ష్మీబాయి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్పాషా ఉన్నారు.
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, పట్టణ, గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లతో పాటు మరిన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా 2వ వార్డులో మురుగు కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో రూ.63లక్షల వ్యయంతో నిర్మించబడ్డ సబ్ రిజిస్ట్రార్ నూతన కార్యాలయ భవనాన్ని, రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. గాంధీనగర్లోని చర్చి సీసీ రోడ్డు పనులకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఐనాన్పల్లి, బుల్కాపూర్ గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి రోడ్డుకు ఇరువైపులా మొరం తప్పక వేయించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కొడంగల్ మున్సిపాలిటీ ఏర్పాటుతో అభివృద్ధికిగాను ప్రత్యేకంగా రూ.15కోట్లు మంజూరు చేశామని, ఇందుకు సంబంధించి పనులు జరిగి ప్రారంభోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, పీఏసీఎస్ అధ్యక్షుడు శివకుమార్, కౌన్సిలర్లు మధుసూదన్యాదవ్, ప్రభాకర్గౌడ్, రమేశ్, సరోజ, కోఆప్షన్ సభ్యుడు మునీర్, మాజీ సర్పంచ్ రమేశ్బాబు, మున్సిపల్ కమిషనర్ వెంకటలక్ష్మి, సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్చారి, టీఆర్ఎస్ నాయకులు మురారి వాశిష్ట, అంజద్ ఉన్నారు.
ఇవీ కూడా చదవండి…
మాస్కు ధరించేలా చర్యలు చేపట్టాలి