హాలియా, ఏప్రిల్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. సోమవారం హాలియాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి నాయీబ్రాహ్మణ, రజక సంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలో హెయిర్ సెలూన్, దోభీఘాట్లకు ఈ నెల 1నుంచి ఉచిత విద్యుత్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వృత్తిదారులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో జాతీయ రజక సంఘాల కో కన్వీనర్ మల్లేశ్ కుమార్, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు ఉప్పలయ్య. జిల్లా అధ్యక్షుడు పగిళ్ల సైదులు, టీఆర్ఎస్ నాయకుడు మలిగిరెడ్డి లింగారెడ్డి, మండలాధ్యక్షుడు నారాయణదాస్ అంజయ్య, నాయీబ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షుడు సురభి రాంబాబు, కృష్ణయ్య, నరేందర్, కృష్ణ, శ్రీను పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్తోనే రజకుల అభివృద్ధి
గుర్రంపోడు : రజకుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు చెన్నయ్య అన్నారు. సోమవారం మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. వెనుకబడిన కులాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. రజకులకు ప్రతి నెలా 250యూనిట్ల కరెంట్ ఉచితంగా సరఫరా చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రజక సంఘం మండలాధ్యక్షుడు గోలి శంకర్, నాయకులు ముష్టిపల్లి అంజి, పోలేపల్లి రమేశ్, భాస్కర్, రేవెళ్లి శ్రీను, పోలేపల్లి యాదయ్య, పగిళ్ల ముత్యం, లింగస్వామి, సత్యనారాయణ, భిక్షమయ్య, మహేశ్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
బలహీనవర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్
కరాటేలో నర్సంపేట విద్యార్థుల ప్రతిభ