న్యూఢిల్లీ: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో పతకాలు గెలిచిన షూటర్లకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. పీ4 మిక్స్డ్ 50మీటర్ల పిస్తోల్ ఈవెంట్లో ఇవాళ షూటర్ మనీశ్ నర్వాల్ పసడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ షూటర్కు ఆరు కోట్లు ఇవ్వనున్నట్లు ఇవాళ హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే ఈవెంట్లో సిల్వర్ మెడల్ గెలిచిన మరో షూటర్ సింగరాజ్ అధానాకు నాలుగు కోట్ల రివార్డును ఇవ్వనున్నట్లు హర్యానా గవర్నమెంట్ వెల్లడించింది. పతకాలు గెలిచిన ఈ ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నట్లు హర్యానా సర్కార్ చెప్పింది.
భారత్కు పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ అందించిన షూటర్ నర్వాల్ను, సిల్వర్ మెడల్ గెలిచిన సింగరాజ్ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆ ఇద్దరితోనూ ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. పారా అథ్లెట్లను ప్రధాని మోదీ ప్రోత్సహించిన తీరు అద్భుతమని ఆ అథ్లెట్లు పేర్కొన్నారు. తమకు సపోర్ట్ ఇచ్చినందుకు ప్రధానికి ఆ ఇద్దరూ థ్యాంక్స్ చెప్పారు.