ఇందూరు, ఆగస్టు 16: ఇండో-నేపాల్ రూరల్ గేమ్స్-2021 ఆధ్వర్యంలో కాఠ్మాండులో జరిగిన అంతర్జాతీయ చెస్ పోటీల్లో నిజామాబాద్కు చెందిన హర్షిత, రిషిత స్వర్ణ పతకాలు సాధించారు. వాళ్ల తండ్రి నర్సింగ్రావు కు టుంబ పరిస్థితి అంతం త మాత్రంగానే ఉండడంతో.. ఆ చిన్నారులకు పోటీల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత ఆర్థికసాయం అందించారు. ఆదివారం నాటి పోటీల్లో హర్షిత (అండర్-14), రిషిత (అండర్-11) కేటగిరిలో స్వర్ణ పతకాలను నెగ్గారు.