నార్తంప్టన్: భారత ఫీల్డర్ హర్లీన్ డియోల్.. ఇంగ్లండ్తో తొలి టీ20లో అద్భుత క్యాచ్తో ఆకట్టుకుంది. అప్పటికే 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి జోష్లో ఉన్న జోన్స్.. శిఖ బౌలింగ్లో మరో భారీ షాట్కు యత్నించగా.. బౌండ్రీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకుంది. ఈ క్రమంలో అదుపుతప్పి బౌండ్రీ బయటకు వెళ్లబోయే సమయంలో బంతిని గాల్లోకి ఎగరేసి తిరిగి మైదానంలోకి దూకుతూ క్యాచ్ను పూర్తి చేసింది. శుక్రవారం అర్ధరాత్రి ఇంగ్లండ్తో జరిగిన ఈ తొలి టీ20మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో(డక్వర్త్ లూయిస్) ఓటమి పాలైంది. తొలుత స్కీవర్(55), జోన్స్(43) రాణించంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 177/7 స్కోరు చేసింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని 8.4 ఓవర్లలో 73కు సవరించగా భారత్ 54/3 స్కోరుకే పరిమితమైంది.