కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని హౌరా (రూరల్) ఎస్పీ సౌమ్యా రాయ్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) తొలగించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆయన భార్య, నటి లవ్లీ మైత్రా పోటీ చేస్తుండటమే దీనికి కారణం. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనాపూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి లవ్లీ పోటీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల కుటుంబ సభ్యులు ఎవరూ ఎన్నికల ప్రక్రియలో భాగం కాకూడదని ఈసీఐ కార్యాలయం స్పష్టం చేసింది. అందుకే సౌమ్యా రాయ్ను ఎన్నికల విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. లవ్లీ మైత్రాకు టీఎంసీ టికెట్ ఇవ్వగానే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఈసీఐ సౌమ్యా రాయ్ను పక్కను పెట్టింది.