మంత్రి కేటీఆర్ను కలిసిన క్రికెటర్ హనుమ విహారి

హైదరాబాద్: టీమ్ఇండియా బ్యాట్స్మన్ హనుమ విహారి సోమవారం తెలంగాణ ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఆసీస్ గడ్డపై చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్ శాలువాతో సన్మానించారు. ఆసీస్ పర్యటనకు సంబంధించిన విషయాలను విహారీ..కేటీఆర్కు వివరించాడు. మిమ్మల్ని కలవడం, క్రికెట్ గురించి సంభాషించడం చాలా ఆనందంగా ఉందని విహారి ట్విటర్లో పేర్కొన్నాడు. కేటీఆర్తో దిగిన ఫొటోను తెలుగు క్రికెటర్ షేర్ చేశాడు.
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో అద్భుత డిఫెన్స్తో ఆకట్టుకున్న హనుమ విహారీ , రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తొడకండరాల గాయం కారణంగా విహారి ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరంకావడంతో ఇటీవల స్వదేశం చేరుకున్నాడు. మూడో టెస్టును టీమ్ఇండియా డ్రా చేసుకోవడంపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో స్పందించిన విషయం తెలిసిందే. టెస్టు డ్రా..ఇన్నింగ్స్ విజయం కన్నా బాగుందని ప్రశంసించారు.
It was a pleasure meeting you and having a conversation about cricket sir.@KTRTRS pic.twitter.com/SyYB64HAGG
— Hanuma vihari (@Hanumavihari) January 18, 2021
తాజావార్తలు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయాభివృద్ధి
- కాళేశ్వరం చేరుకున్న వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు
- అంతర్జాతీయ విమానాలపై నిషేధం : మార్చి 31 వరకూ పొడిగింపు!
- 2021 న్యూ జియో ఫోన్.. రెండేండ్ల వరకు అన్లిమిటెడ్ సర్వీస్ ఆఫర్!