తిరువనంతపురం: కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ పుత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 86 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నేతలు రమేష్ చెన్నితాలా హరిపాడ్ నుంచి, కే మురళీధరన్ నెమోమ్ నుంచి పోటీ చేయనున్నారు.
కాగా, ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న పూర్తి నమ్మకం తమకు ఉన్నదని కేరళ కాంగ్రెస్ చీఫ్ ముల్లపల్లి రామచంద్రన్ తెలిపారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రకటించిన జాబితా, తరాల మార్పును స్పష్టంగా చూపుతున్నదని అన్నారు. అలాంటి జాబితాను రాహుల్ గాంధీ కోరుకున్నారని, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.