హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర క్రీడాశాఖలు, భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) సహకారంతో దేశంలో హ్యాండ్బాల్కు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్(హెచ్ఎఫ్ఐ) చీఫ్ జగన్మోహన్రావు అన్నారు. అంతర్జాతీయ హ్యాండ్బాల్ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ప్రతీ జిల్లాలో హ్యాండ్బాల్ అకాడమీ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్లో ఇండోర్ స్టేడియంతో పాటు అకాడమీ నెలకొల్పే సన్నాహాల్లో ఉన్నామన్నారు.