హైదరాబాద్, ఆట ప్రతినిధి: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి కేవీఎల్ పావని కుమారి సత్తాచాటింది. పటియాల వేదికగా జరుగుతున్న జాతీయ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో పావని కుమారి స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన బాలికల యూత్ 45 కిలోల విభాగం స్నాచ్లో 69 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 82 కిలోలు ఎత్తిన పావని మొత్తంగా 151 కిలోలతో పసిడి ఒడిసి పట్టింది. అదే జోరులో మహిళల జూనియర్ విభాగంలోనూ (69కి+82కి) రజతం దక్కించుకుంది. జాతీయ టోర్నీలో రెండు పతకాలతో ఆకట్టుకున్న పావనిని స్పోర్ట్స్ స్కూల్ వెయిట్లిఫ్టింగ్ కోచ్ మాణిక్యాలరావు అభినందించారు.