ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం
నేలకొరిగిన పైరు.. తడిసిన ధాన్యం..
నిలిచిన విద్యుత్ సరఫరా.. అంధకారంలో గ్రామాలు..
ఉట్నూర్/బోథ్/సోన్/ఇంద్రవెల్లి/దహెగాం/ కెరమెరి, ఏప్రిల్ 11 :ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శని, ఆదివారం ఉదయం ఆకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల పంటలు నేలకొరిగాయి. ఇప్పటికే కోసి న పంటలు తడువకుండా ఉండేందుకు రైతుల టార్ఫాలిన్లు కప్పారు.దహెగాం మండలానికి వచ్చే 33 కేవీ లైన్ స్తంభాలు రెండు విరిగిపోవడంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎండ వేడిమి, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం కలిగినట్లయ్యింది