అతాను, దీపికకు పసిడి పతకాలు
గ్వాటెమాల సిటీ: స్టార్ దంపతులు దీపిక కుమారి, అతాను దాస్ అద్భుత ప్రదర్శనతో ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో భారత్ సత్తాచాటింది. మొత్తంగా మూడు స్వర్ణాలు, ఓ కాంస్యం దక్కించుకొని ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. సోమవారం మెకంజీ బ్రౌన్ (అమెరికా), దీపక మధ్య జరి గిన మహిళల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్ తొలుత 9-9తో సమం కాగా టైబ్రేకర్లో దీపిక 6-5తో గెలిచింది. పురుషుల విభాగంలో అతాను 6-4తో డానియెల్ కాస్ట్రో (స్పెయిన్)పై నెగ్గి పసిడి పట్టాడు. అంతకు ముందు దీపిక, అకింత, కోమలికతో కూడిన భారత మహిళల జట్టు మెక్సికో త్రయాన్ని చిత్తుచేసి బంగారు పతకాన్ని సాధించింది.