న్యూఢిల్లీ: భారత యువ హైజంపర్ తేజస్విన్ శంకర్ స్వర్ణ పతకంతో మెరిశాడు. మాన్హట్టన్(అమెరికా) వేదికగా జరిగిన బిగ్12 ఔట్డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్షిప్లో శంకర్ హైజంప్లో సత్తాచాటాడు. కన్సాస్ స్టేట్ యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగిన శంకర్ 2.28 మీటర్లు ఎత్తు ఎగిరి పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన ఈ యువ అథ్లెట్ తృటిలో జాతీయ రికార్డు(2.29 మీ) చేజార్చుకున్నాడు. ఇదే పోటీలో పాల్గొన్న వెర్నాన్ టర్నర్(2.25మీ), జాక్వెన్ హోగన్(2.11మీ) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. చాంపియన్షిప్లో శంకర్కు ఇది వరుసగా రెండో స్వర్ణం కావడం విశేషం.