యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బాలాలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు స్వస్తివచనం, విష్వక్సేన పూజ, పున్యాహవచనం కార్యక్రమాలను ప్రధానార్చకులు నల్లంతీగళ్ లక్ష్మీ నరసింహచార్యులు ఆధ్వర్యంలో జరిగాయి. పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులకు అనుమతిని నిరాకరించారు. ఉత్సవాలలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో గీత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.