వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యఛేదనలో స్పిన్నర్ ఆస్టన్ అగర్(6/30) ధాటికి కివీస్ 17.1 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. అగర్ స్పిన్ విజృంభణతో గప్టిల్(43), కాన్వె(38) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. తొలుత మ్యాక్స్వెల్(70), కెప్టెన్ ఫించ్(69) అర్ధసెంచరీలతో ఆసీస్ 20 ఓవర్లలో 208/4 స్కోరు చేసింది. ఆదిలోనే వేడ్(5) వికెట్ కోల్పోయినా ఫించ్, మ్యాక్స్వెల్కు తోడు ఫిలిపి జత కలువడంతో ఆసీస్కు పోరాడే స్కోరు దక్కింది. కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన అగర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.