హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత మాస్టర్స్ గేమ్స్ సమాఖ్య(ఎమ్జీఎఫ్) కార్యవర్గం కొత్తగా కొలువుదీరింది. హిమాచల్ ప్రదేశ్ వేదికగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 24 గుర్తింపు పొందిన రాష్ర్టాల నుంచి 43 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ (టీఎమ్జీఏ) ప్రధాన కార్యదర్శి ఎమ్ ప్రభాకరరావు ఎమ్జీఎఫ్ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు రాష్ర్టానికే చెందిన శ్రీనివాస్రెడ్డి ఎమ్జీఎఫ్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.